సీఐ క్షమాపణ చెప్పాల్సిందే

ABN , First Publish Date - 2021-04-18T06:25:38+05:30 IST

ఈసీ ఇచ్చిన నోటీసులు శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడికి అందజేసినందుకు బీఎన్‌కండ్రిగ సీఐ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.

సీఐ క్షమాపణ చెప్పాల్సిందే
బీఎన్‌కండ్రిగలో చెక్‌పోస్టు వద్ద రాస్తారోకో చేస్తున్న ఎస్సీవీ అనుచరులు

 బుచ్చినాయుడుకండ్రిగ, ఏప్రిల్‌ 17: శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు బుచ్చినాయుడుకండ్రిగలో రిగ్గింగ్‌యత్నం చేస్తున్నారని పనబాక లక్ష్మి ఇటీవల ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఆదేశాలు కలెక్టర్‌ ద్వారా అందుకున్న సీఐ ఆరోహణరావు బుచ్చినాయుడు కండ్రిగ చెక్‌పోస్టు వద్ద ఎస్సీవీ వాహనాన్ని ఆపి నోటీసులిచ్చారు. శనివారం రాత్రి 7 గంటల వరకు ఎక్కడా తిరగొద్దని పేర్కొన్నారు. వరదయ్యపాళెంలో జరిగిన కార్యక్రమానికి వెళ్లి వస్తున్న తనను అడ్డుకోవడమేమిటని ఆయన అసహనం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సీవీ మద్దతుదారులు పెద్దఎత్తున అక్కడకు చేరుకున్నారు. ఉద్దేశపూర్వకంగానే సీఐ అడ్డుకున్నారంటూ, ఆయన్ను సస్పెండ్‌ చేయాలని రాస్తారోకో చేపట్టారు. వైసీపీ నేత విజయానందరెడ్డి జోక్యం చేసుకుని సీఐతో ఎస్సీవీకి క్షమాపణ చెప్పించడంతో గొడవ సద్దుమణిగింది. 

Updated Date - 2021-04-18T06:25:38+05:30 IST