మురుగు కాల్వలు పరిశీలించిన కలెక్టర్
ABN , First Publish Date - 2021-07-24T05:21:10+05:30 IST
మురుగు కాల్వలు పరిశీలించిన కలెక్టర్
యాలాల: మండలంలోని అగ్గనూరు, సంగెంఖుర్దు గ్రామాలను కలెక్టర్ పౌసుమి బసు శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఆయా గ్రామాల్లో పల్లెప్రగతి పనుల వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండేందుకు సర్పంచులు కృషి చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మణ్నాయక్, సర్పంచులు శ్రీలత, భీమప్ప, పటేల్రెడ్డి, వివిధశాఖల అధికారులు తదితరులున్నారు.