ట్రాక్టర్ ఎక్కిన కలెక్టర్
ABN , First Publish Date - 2021-07-23T05:30:00+05:30 IST
వికారాబాద్జిల్లా తాండూరు నియోజకవర్గంలోని
- మూడు కిలోమీటర్లు ప్రయాణించి వైకుంఠధామాన్ని పరిశీలించిన పౌసుమిబసు
తాండూరు: వికారాబాద్జిల్లా తాండూరు నియోజకవర్గంలోని యాలాల మండలం సంగెంఖుర్దు గ్రామంలో వైకుంఠధామాన్ని పరిశీలించేందుకు కలెక్టర్ పౌసుమిబసు ట్రాక్టర్ ఎక్కారు. గ్రామం నుంచి వైకుంఠధామానికి వెళ్లేరోడ్డు వర్షాల కారణంగా పూర్తిగా బురదమయంగా మారడంతో కార్లు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో ట్రాక్టర్పై ఎక్కి మూడు కిలోమీటర్ల వరకు వెళ్లి వైకుంఠధామాన్ని పరిశీలించారు. ఈ రోడ్డును మం జూరు చేయాలని స్థానికులు కలెక్టర్ను కోరగా వెంటనే ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. నిధులు మంజూరు కాగానే నెలరోజుల్లో రోడ్డు వేయిస్తానని గ్రామస్థులకు హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట సర్పంచ్ శ్రీలత, వివిధ శాఖల అధికారులు తదితరులున్నారు.