ప్రభుత్వాస్పత్రిని తనిఖీ చేసిన కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-05-25T06:25:26+05:30 IST

స్థానిక సీహెచసీ కలెక్టర్‌ బసంతకుమార్‌ మంగళవారం తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు మంచి వైద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.

ప్రభుత్వాస్పత్రిని తనిఖీ చేసిన కలెక్టర్‌
కొత్తచెరువు ప్రభుత్వాస్పత్రిలో సిబ్బందితో మాట్లాడుతున్న దృశ్యం


కొత్తచెరువు, మే 24  : స్థానిక సీహెచసీ  కలెక్టర్‌ బసంతకుమార్‌ మంగళవారం తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు మంచి వైద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. సీహెచసీలోని సమస్యలపై ఆరా తీశారు. సిబ్బంది, రోగులతో మాట్లాడారు.  పెనుకొండ రహదారిలోని జగనన్నకాలనీలో నిర్మిస్తున్న ఇళ్ల పని తీరును పరిశీలించారు. పలు విషయాలపై  హౌసింగ్‌ అధికారుల వద్ద ఆరా తీశారు.  అనంతరం మీర్జాపురం, తలమర్ల, మరకుంటపల్లి, కొడపగానిపల్లి గ్రామాల్లో ఉపాధి పనులను పరిశీలించారు. కొడపగానిపల్లి గ్రామంలో వర్మీకంపోస్టును పరిశీలించారు. ఆయన వెంట ఆర్డీఓ బాగ్యరేఖ, డీపీఓ విజయ్‌కుమార్‌, తహసీల్దార్‌ వెంకటరెడ్డి,  ఎంపీడీఓ సిద్దారెడ్డి, సర్పంచ అలివేళమ్మ, ఏపీఓ నాగిరెడ్డి, కార్యదర్శి గంగాధర్‌రెడ్డి, హౌసింగ్‌ ఏఈ హరిప్రకాశరెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2022-05-25T06:25:26+05:30 IST