వైసీపీ నాయకుడిపై ఎంపీటీసీ అభ్యర్థిని ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-03-01T06:02:52+05:30 IST

వైసీపీ నాయకుడిపై అదే పార్టీకి చెందిన ఎంపీటీసీ అభ్యర్థిని ఇంద్రపాలెం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

వైసీపీ నాయకుడిపై ఎంపీటీసీ అభ్యర్థిని ఫిర్యాదు

కాకినాడ రూరల్‌, ఫిబ్రవరి 28: వైసీపీ నాయకుడిపై అదే పార్టీకి చెందిన ఎంపీటీసీ అభ్యర్థిని ఇంద్రపాలెం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. కాకినాడ రూరల్‌ మండలం గంగనాపల్లికి చెందిన వాసంశెట్టి సత్యవేణి వైసీపీ తరపున ఎంపీటీసీ అభ్యర్థినిగా పోటీ చేస్తున్నారు. అయితే ఇంద్రపాలానికి చెందిన వైసీపీ మండల విద్యార్థి విభాగం అధ్యక్షుడు గీసాల వీరబాబు తాను పోటీ చేస్తున్న గ్రామ పరిధిలోని ప్రజలకు తన గురించి అసభ్యకరపదజాలంతో ఫోన్‌ చేసి చెప్తున్నాడని సత్యవేణి చెప్పింది. తమ వద్ద ఉన్న ఆడియో రికార్డింగ్‌ల ఆధారంగా పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. దీంతో వీరబాబుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇంద్రపాలెం ఎస్‌ఐ నాగార్జునరాజు తెలిపారు. 

Updated Date - 2021-03-01T06:02:52+05:30 IST