రేషన్ పంపిణీ అక్రమాలపై ఫిర్యాదు
ABN , First Publish Date - 2021-03-09T06:31:20+05:30 IST
కవిటి మండలంలోని డి.గొనపపుట్టుగ పం చాయతీలో రేషన్ పంపిణీలో జరి గిన అక్రమాలపై విచారణ చేయాలని ఆ గ్రామానికి చెందిన పలువురు జేసీ సుమిత్కుమార్కు సోమవారం ఫిర్యాదుచేశారు.
కలెక్టరేట్/కవిటి: కవిటి మండలంలోని డి.గొనపపుట్టుగ పం చాయతీలో రేషన్ పంపిణీలో జరి గిన అక్రమాలపై విచారణ చేయాలని ఆ గ్రామానికి చెందిన పలువురు జేసీ సుమిత్కుమార్కు సోమవారం ఫిర్యాదుచేశారు. జనవరికి సంబంధించిన రేషన్ సరుకులు అందించకుండా డీలర్లు, గ్రామపెద్దలు దోపిడీ చేశారని ఆరోపించారు. సరుకు లు అందించకుండా అందించినట్టు రికార్డుల్లో చూపిస్తున్నారని తెలిపారు. అవకతవకులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకొని, లబ్ధిదారులకు జనవరి రేషన్ అందించాలని గ్రామానికి చెందిన పి.దేవేంద్ర మూర్తి, మొహన్ సాహు, మజ్జి దుర్యోధన కోరారు.