మరో 36 మందికి కరోనా
ABN , First Publish Date - 2021-11-27T07:19:59+05:30 IST
జిల్లాలో గురు, శుక్రవారాల మధ్య 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 36 మందికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారించారు.
తిరుపతి, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గురు, శుక్రవారాల మధ్య 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 36 మందికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారించారు. ఆ వ్యవధిలో కొవిడ్తో ఎవరూ మృతిచెందలేదు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 247916కు చేరగా, కొవిడ్ మరణాలు 1953గా ఉన్నాయి. శుక్రవారం ఉదయానికి 299 యాక్టివ్ పాజిటివ్ కేసులున్నాయి. తాజా కేసులు.. తిరుపతి అర్బన్లో 13, మదనపల్లెలో 6, చిత్తూరులో 5, శ్రీకాళహస్తి, పుత్తూరు, పీలేరు మండలాల్లో 2 చొప్పున, తిరుపతి రూరల్, చంద్రగిరి, కేవీపల్లె, గుడిపాల, గంగవరం, కలకడ మండలాల్లో ఒక్కొక్కటి నమోదయ్యాయి.