పిడుగుపాటుకు వ్యక్తి మృత్యువాత

ABN , First Publish Date - 2022-06-25T04:34:42+05:30 IST

: పిడుగుపాటుకు జడూరు గ్రామానికి చెందిన గొండు లక్ష్మణరావు (55) అనే వ్యక్తి మృత్యువాత పడ్డాడు. శుక్రవారం మధ్యాహ్నం పొలంలో పశువులు మేపుతుండగా ఉరుములతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఇంతలో పిడుగుపడడంతో లక్ష్మణరావు పొలంలోనే కుప్పకూలిపోయాడు. చుట్టుపక్కల వారు

పిడుగుపాటుకు వ్యక్తి మృత్యువాత
మృతదేహం వద్ద రోదిస్తున్న బంధువులు

జడూరులో విషాదం
జడూరు (పోలాకి), జూన్‌ 24:
పిడుగుపాటుకు జడూరు గ్రామానికి చెందిన గొండు లక్ష్మణరావు (55) అనే వ్యక్తి మృత్యువాత పడ్డాడు. శుక్రవారం మధ్యాహ్నం పొలంలో పశువులు మేపుతుండగా ఉరుములతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఇంతలో పిడుగుపడడంతో లక్ష్మణరావు పొలంలోనే కుప్పకూలిపోయాడు. చుట్టుపక్కల వారు వచ్చి గమనించేసరికి మృత్యువాత పడ్డాడు. మృతుడికి భార్య లక్ష్మీకాంతం, కుమార్తె గొండు మౌనిక, కుమారుడు గణపతి ఉన్నారు. పిల్లలిద్దరూ ఉన్నత చదువుల్లో ఉన్నారు. జడ్పీ సీఈవోగా ఉంటూ అనారోగ్యంతో మృత్యువాత పడిన శ్రీకాకుళం జడ్పీ సీఈవో గొండు చక్రధర్‌కు స్వయాన చిన్నాన్న. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సర్పంచ్‌ గొల్లంగి అసిరితాత, ఎంపీటీసీ ప్రతినిధి గొండు మురళీ, మాజీ జడ్పీటీసీ గొండు రామన్న, గాతలవలస సర్పంచ్‌ మెండ శ్రీనివాసరావు, ఎంపీటీసీ వై.లక్ష్మణరావు తదితరులు సంతాపం తెలిపారు.





Updated Date - 2022-06-25T04:34:42+05:30 IST