రామాయంపేట చెరువులో చేపల మృత్యువాత
ABN , First Publish Date - 2022-10-07T06:00:14+05:30 IST
పట్టణంలో మల్లెచెరువులో చేపలు మృత్యువాత పడిన సంఘటన గురువారం జరిగింది.
రామాయంపేట, అక్టోబరు 6: పట్టణంలో మల్లెచెరువులో చేపలు మృత్యువాత పడిన సంఘటన గురువారం జరిగింది. కారణమేంటో తెలియనప్పటికీ వేలాది చేపలు చనిపోయాయి. అయితే, పంట పొలాలపై పురుగుల మందు కొట్టగా, బుధవారం రాత్రి ఒక్కసారిగా భారీ వర్షం కురియడంతో పొలాల్లోని నీరంతా చెరువులోకి రావడంతో చేపలు మృత్యువాత పడినట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ చేపలు చనిపోవడంతో మత్స్యకారులకు తీవ్ర నష్టం వాటిల్లింది.