12 నుంచి డిగ్రీ పరీక్షలు

ABN , First Publish Date - 2021-03-02T05:38:55+05:30 IST

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు 3, 5 సెమెస్టర్‌ పరీక్షలు ఈ నెల 12వ తేదీ నుంచి నిర్వహించనున్నట్టు డీన్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ బిడ్డిక అడ్డయ్య తెలిపారు. ఈ నెల 12 నుంచి 24 వరకూ ఉదయం 3వ, మధ్యా

12 నుంచి డిగ్రీ పరీక్షలు




 బీఈడీ, బీపీఈడీ పరీక్ష 15కు వాయిదా

ఎచ్చెర్ల, మార్చి 1: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు 3, 5 సెమెస్టర్‌ పరీక్షలు ఈ నెల 12వ తేదీ నుంచి నిర్వహించనున్నట్టు డీన్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ బిడ్డిక అడ్డయ్య తెలిపారు. ఈ నెల 12 నుంచి 24 వరకూ ఉదయం 3వ, మధ్యాహ్నం 5వ సెమెస్టర్‌పరీక్షలు జరుగుతాయని చెప్పారు. బీఈడీ, బీపీఈడీ పరీక్షలకు సంబంధించి ఈ నెల 10న జరగాల్సిన పరీక్ష పేపరును 15వ తేదీకి వాయిదా వేసినట్టు చెప్పారు. ఈ నెల 10వ తేదీన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ జరగనున్న దృష్ట్యా పరీక్షను వాయిదా వేశామన్నారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని సూచించారు. వర్సిటీ పరిధిలో 15 బీఈడీ కళాశాలలకు అఫిలియేషన్‌ ఇచ్చామన్నారు. వర్సిటీలో పీజీ విద్యార్థులకు 3వ సెమెస్టర్‌ పరీక్షలు జరుగుతున్నాయని... ఒకటో సెమిస్టర్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.


Updated Date - 2021-03-02T05:38:55+05:30 IST