డీఈవో ఇంట విషాదం!

ABN , First Publish Date - 2021-05-10T04:58:15+05:30 IST

జిల్లా విద్యాశాఖ అధికారి కుసుమ చంద్రకళ ఇంట విషాదం అలముకుంది. కరోనాతో 24 గంటల వ్యవధిలో ఆమె తల్లి, భర్త మృతి చెందారు.

డీఈవో ఇంట విషాదం!

కరోనాతో 24 గంటల వ్యవధిలో తల్లి, భర్త మృతి

గుజరాతీపేట, మే 9 : జిల్లా విద్యాశాఖ అధికారి కుసుమ చంద్రకళ ఇంట విషాదం అలముకుంది. కరోనాతో 24 గంటల వ్యవధిలో ఆమె తల్లి, భర్త మృతి చెందారు. శనివారం ఆమె తల్లి రోజా విజయలక్ష్మి శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందారు. ఆదివారం ఆమె భర్త కమల కుమార్‌ విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశారు. గత నెల 23న కమలకుమార్‌ కరోనా బారినపడడంతో విశాఖలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. తరువాత డీఈవోతో పాటు ఆమె కుమార్తె, తల్లికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. చికిత్సపొందడంతో డీఈవో, ఆమె కుమార్తె కోలుకున్నారు. తల్లి రోజా విజయలక్ష్మి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేర్పించారు. గంటల వ్యవధిలో తల్లి, భర్త మృతిచెందడంతో డీఈవో విషాదంలో మునిగిపోయారు. అధికారులు, ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు సంతాపం తెలిపార



 

Updated Date - 2021-05-10T04:58:15+05:30 IST