సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యం

ABN , First Publish Date - 2022-07-01T06:22:01+05:30 IST

సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యం

సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యం


కీసర రూరల్‌, జూన్‌ 30 : సమన్వయంతోనే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యమని నాగారం మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రారెడ్డి అన్నారు. గురువారం మున్సిపల్‌ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధుల పరస్పర సహకారంతోనే మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రాధాన్యతాంశాల వారీగా నిధులు కేటాయిస్తూ, దశలవారీగా వార్డుల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పార్కుల అభివృద్ధి, ఎవెన్యూ ప్లాంటేషన్‌కు రూ.55లక్షలు, సీసీ రోడ్డు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణం పనులకు రూ.32.50లక్షలు, క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు రూ.26.70లక్షలు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకుగాను మున్సిపల్‌ పాలకవర్గం ఆమోదం తెలిపినట్లు వివరించారు. సమావేశంలో కమిషనర్‌ వాణిరెడ్డి, వైస్‌చైర్మన్‌ మల్లే్‌షయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-01T06:22:01+05:30 IST