ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా

ABN , First Publish Date - 2022-05-27T05:30:00+05:30 IST

ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం సముద్రాల బస్టాండ్‌ వద్ద కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు.

ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా
సముద్రాలలో ధర్నా చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు, రైతులు

కోహెడ, మే 27: ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం సముద్రాల బస్టాండ్‌ వద్ద కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. 40 రోజులు గడిచినా ధాన్యం కొనుగోలు చేయడం లేదని నాయకులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో జయచంద్రారెడ్డి ధాన్యం కొనుగోళ్లలో జాప్యం లేకుండా చూస్తామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. ధర్నాలో కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు మంద ధర్మయ్య, కిసాన్‌ కాంగ్రెస్‌ సెల్‌ అధ్యక్షుడు బింరెడ్డి తిరుపతిరెడ్డి, నాయకులు చింతకింది శంకర్‌, పి.సత్తయ్య, వెంకట్‌రెడ్డి, చంద్రం, యాదయ్య, బాలయ్య, రాజయ్య, అజయ్‌ పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-05-27T05:30:00+05:30 IST