జెండా ఆవిష్కరణలోనూ వైసీపీలో విభేదాలు
ABN , First Publish Date - 2022-08-16T06:17:30+05:30 IST
జాతీయజెండా ఆవిష్కరణలోనూ వైసీపీ వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. హిందూపురం మండలం చౌళూరులో స్వాతంత్య్ర సంగ్రామంలో ఆసువులు బాసిన అమరుల స్థూపం వద్ద జెండా ఎగురవేసే కార్యక్రమంలో ఇవి వెలుగు చూశాయి
హిందూపురం, ఆగస్టు 15 : జాతీయజెండా ఆవిష్కరణలోనూ వైసీపీ వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. హిందూపురం మండలం చౌళూరులో స్వాతంత్య్ర సంగ్రామంలో ఆసువులు బాసిన అమరుల స్థూపం వద్ద జెండా ఎగురవేసే కార్యక్రమంలో ఇవి వెలుగు చూశాయి. చౌళూరులో ఉన్న వైసీపీ అసమ్మతి నాయకుడు వైసీపీ మాజీ సమన్వయకర్త చౌళూరు రామక్రిష్ణారెడ్డి వర్గానికి చెందిన ఎంపీపీ, సర్పంచ ఉదయం జెండా ఎగురవేశారు. ఎమ్మెల్సీ వర్గీయులు మరో జెండా కర్రను ఏర్పాటు చేశారు. దీన్ని మధ్యాహ్నం ఒంటి గంట తరువాత ఎమ్మెల్సీ షేక్ మహ్మద్ ఇక్బాల్, ఎంపీ మాధవ్తో కలిసి జెండాను ఎగురవేశారు. ఈ విబేధాల నేపథ్యంలో పోలీసులు ఆదివారం మధ్యాహ్నం నుంచే గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు.