అన్నివర్గాల్లో అసంతృప్తి
ABN , First Publish Date - 2022-09-24T05:17:46+05:30 IST
ప్రభుత్వ పాలనపై అన్ని వర్గాల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్త మవుతోందని మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు.
మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు
రాయదుర్గంటౌన్, సెప్టెంబరు 23: ప్రభుత్వ పాలనపై అన్ని వర్గాల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్త మవుతోందని మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. పట్టణం లోని 6, 30వ వార్డులలో శుక్రవారం నిర్వహించిన బాదుడేబాదుడు కార్య క్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇం టింటికి వెళ్లి ప్రజాసమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా గార్మెం ట్స్, చేనేత పరిశ్రమల కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కార్మికులు విద్యుత్ సమస్యను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈసందర్భంగా ఆయ న మాట్లాడారు. చంద్రబాబు పాలన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ ఛైర్మన్ ముదిగల్లు జ్యోతి, మాజీ వైస్ఛైర్మన్ నల్లపూల వెంకటేశులు, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పొరాళ్లు పురుషోత్తమ్, పొరా ళ్లు ధనార్జున, సంపత్కుమారి, కౌన్సిలర్లు ప్రశాంతి, బళ్లారి జ్యోతి పాల్గొన్నారు.