టీఆర్ఎస్ బెదిరింపులకు భయపడకండి
ABN , First Publish Date - 2021-03-02T05:58:54+05:30 IST
రాష్ట్రంలో టీఆర్ఎస్ అరాచకాలకు ఎవరూ బాధపడకూడదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్రెడ్డి అన్నారు.
ప్రతీ కార్యకర్తకు అండగా కాంగ్రెస్ : ఎంపీ రేవంత్రెడ్డి
ములుగు, మార్చి 1: రాష్ట్రంలో టీఆర్ఎస్ అరాచకాలకు ఎవరూ బాధపడకూడదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్లోని రేవంత్రెడ్డి నివాసంలో డీసీసీ జిల్లా అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో ములుగు మండల కాంగ్రెస్ నాయకులతో కలిశారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీఆర్ఎస్ అరాచకాలకు పాల్పడుతుందని, ఆ పార్టీ బెదిరింపులకు ఎవరూ భయపడకూడదని సూచించారు. పార్టీలో కొనసాగుతున్న ప్రతీ కార్యకర్తకూ కాంగ్రెస్ అండగా ఉంటుందని ఏ ఒక్కరికి ఆపద ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీ అరాచకాలపై పోరాటం చేస్తున్నామని సిద్దిపేట జిల్లాలో కూడా ఏ ఒక్కరూ కూడా అధైర్యపడకుండా సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా, సర్పంచ్ మల్లేష్ యాదవ్, మాజీ సర్పంచ్ కాంతరెడ్డి, గణేష్ యాదవ్, ప్రకాష్, నదీం, కొండల్ రెడ్డి, నర్సింలుతో పాటు వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.