డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను పేదలకు అందజేయాలి

ABN , First Publish Date - 2021-07-24T05:25:55+05:30 IST

చిట్యాల గ్రామంలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను అర్హులైన పేదలందరికీ వెంటనే అందజేయాలని సీపీఎం మండల కార్యదర్శి కొంగరి వెంకట్‌మావో కోరారు.

డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను పేదలకు అందజేయాలి
దొమ్మాట గ్రామంలోని డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను పరిశీలించి నిరసన తెలుపుతున్న నాయకులు

 సీపీఎం నాయకుల డిమాండ్‌


చేర్యాల, జూలై 23: చిట్యాల గ్రామంలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను అర్హులైన పేదలందరికీ వెంటనే అందజేయాలని సీపీఎం మండల కార్యదర్శి కొంగరి వెంకట్‌మావో కోరారు. శుక్రవారం దొమ్మాట గ్రామంలోని డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను పరిశీలించి నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలకు పరిమితమై హామీల అమలులో విఫలమైందన్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ అర్హులకు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తుండడం తగదన్నారు. అంతకుముందు గ్రామమహాసభలో మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు బండకింది అరుణ్‌కుమార్‌, గొర్రె శ్రీనివాస్‌, చిన్న మల్లయ్య, డప్పు చిన్నమల్లయ్య, లింగాల రాజు, తాళ్లపల్లి సూరి తదితరులు పాల్గొన్నారు. 


 

Updated Date - 2021-07-24T05:25:55+05:30 IST