డ్రైనేజీ నిర్మాణం, గృహ నిర్మాణ రుణాలు ఇప్పించండి

ABN , First Publish Date - 2022-05-16T06:49:04+05:30 IST

రామచంద్రపురం మండలం నవరత్నాల గరువులో డ్రైనేజీ నిర్మాణం చేయించాలని, గృహ నిర్మాణ రుణాలు మంజూరు చేయాలని పలువురు బీసీ సంక్షేమ, సమాచార, ప్రసార శాఖా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు విజ్ఞప్తి చేశారు.

డ్రైనేజీ నిర్మాణం, గృహ నిర్మాణ రుణాలు ఇప్పించండి

ద్రాక్షారామ, మే 15: రామచంద్రపురం మండలం నవరత్నాల గరువులో డ్రైనేజీ నిర్మాణం చేయించాలని, గృహ నిర్మాణ రుణాలు మంజూరు చేయాలని పలువురు బీసీ సంక్షేమ, సమాచార, ప్రసార శాఖా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం తాళ్లపొలం పంచాయతీ పరిధిలో నవరత్నాల గరువులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి వేణుగోపాలకృష్ణ పర్యటించారు. కుటుంబాల వారీగా ప్రభుత్వ అందించిన సంక్షేమ పథకాలు వివరించారు. అందుకు సంబందించిన కరపత్రాలు అందజేశారు. గ్రామంలో పోగుపడిన చెత్తను మంత్రి వేణు పరిశీలించారు. వెంటనే దానికి నిప్పు పెట్టి అట్టించారు. ఎప్పుడు చెత్త అప్పుడు తగలపెడితో బాగుంటుందన్నారు.  ఏఎంసీ చైర్మన్‌ పండు గోవిందరాజు, ఐడీబీఐ డైరెక్టరు వాసంశెట్టి శ్రీనివాస కుమార్‌, ఎంపీపీ అంబటి భవానీ, జడ్పీటీసీ సభ్యుడు మేర్నీడి వెంకటేశ్వరావు, సర్పంచ్‌ కట్టా గోవిందు, ఉపసర్పంచ్‌ వల్లు శివ, ఎంపీటీసీ సభ్యుడు పంపన ఏడుకొండలు పాల్గొన్నారు. 

 


Updated Date - 2022-05-16T06:49:04+05:30 IST