ఎమ్మెల్యే ద్వారంపూడిని అడ్డుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు

ABN , First Publish Date - 2021-10-26T19:28:19+05:30 IST

కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడికి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి సెగతగిలింది.

ఎమ్మెల్యే ద్వారంపూడిని అడ్డుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు

తూ.గో. జిల్లా: కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడికి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి సెగతగిలింది. ఎయిడెడ్ స్కూల్స్ మూసివేతపై ఎమ్మెల్యేకు స్థానికుల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. జగన్నాథపురంలో సెయింట్ ఆన్స్, ఎయిడెడ్ స్కూల్స్ మూసివేయవద్దని డిమాండ్ చేశారు. మూసివేత ప్రయత్నాలు విరమించకపోతే ఊరుకోబోమని హెచ్చరించారు. అటుగా వచ్చిన ఎమ్మెల్యేను విద్యార్థుల తల్లిదండ్రులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. ప్రభుత్వం విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ కాసేపు పరిస్థితి ఉద్రిక్తతగా మారింది.

Updated Date - 2021-10-26T19:28:19+05:30 IST