తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం...ముగ్గురు దుర్మరణం

ABN , First Publish Date - 2022-02-20T16:18:49+05:30 IST

తూర్పుగోదావరి జిల్లా యానాం-ఎదుర్లంక బాలయోగి వారధిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం...ముగ్గురు దుర్మరణం

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా యానాం-ఎదుర్లంక బాలయోగి వారధిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాన్‌ - బైక్‌ పరస్పరం ఢీకొన్న ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బైక్‌పై నిర్లక్ష్యంగా ఐదుగురు ప్రయాణిస్తున్నారని సమాచారం. మృతులు ఐ.పోలవరం మండలం గుత్తిన దీవికి చెందిన కుమార్‌ (32), పద్మ (27), హర్ష (10)గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు పిల్లలు హర్షిత, లక్కీలను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-02-20T16:18:49+05:30 IST