సచివాలయ సిబ్బంది సకాలంలో విధులకు రావాలి

ABN , First Publish Date - 2021-03-03T07:01:24+05:30 IST

సామర్లకోట, మార్చి 2: సచివాలయ సిబ్బంది సకాలంలో విధులకు రాకపోతే చర్యలు తప్పవని జాయింట్‌ కలెక్టర్‌ బి.రాజకుమారి హెచ్చరించారు. మంగళవారం సామర్లకోట మండలం వేట్లపాలెంలోని 1,2,3 గ్రామ సచివాలయాలను ఆమె తనిఖీ చేశారు. సచివాలయాల్లో పలు రికార్డులను పరిశీలించి

సచివాలయ సిబ్బంది సకాలంలో విధులకు రావాలి
వేట్లపాలెంలో సచివాలయం సిబ్బందితో మాట్లాడుతున్న జేసీ

లేకపోతే చర్యలు తప్పవు:  జేసీ రాజకుమారి హెచ్చరిక

సామర్లకోట, మార్చి 2: సచివాలయ సిబ్బంది సకాలంలో విధులకు రాకపోతే చర్యలు తప్పవని జాయింట్‌ కలెక్టర్‌ బి.రాజకుమారి హెచ్చరించారు. మంగళవారం సామర్లకోట మండలం వేట్లపాలెంలోని 1,2,3 గ్రామ సచివాలయాలను ఆమె తనిఖీ చేశారు. సచివాలయాల్లో పలు రికార్డులను పరిశీలించి పలు అంశాలపై సిబ్బంది నుంచి సమాచారం సేకరించారు. వైఎస్సార్‌ అసరా, చేయూత, బీమా వంటి పథకాల అమలులో ఎటువంటి నిర్లక్ష్యం ఉండరాదని హెచ్చరించారు. సచివాలయానికి వచ్చే ప్రతీ దరఖాస్తు నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని, లేకుంటే తిరస్కరణకు గల కారణంపై దరఖాస్తుదారుడికి సమాచారం అందివ్వాలని సూచించారు. సిబ్బంది సమయపాలన పాటించాలని లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. సిబ్బంది మూవ్‌మెంట్‌ రిజిస్టర్‌ అమలు చేయాలని జేసీ రాజకుమారి ఆదేశించారు.


Updated Date - 2021-03-03T07:01:24+05:30 IST