సంగారెడ్డి జిల్లాలో ఎనిమిది మందికి కరోనా
ABN , First Publish Date - 2022-07-01T05:52:14+05:30 IST
సంగారెడ్డి జిల్లాలో గురువారం ఎనిమిది మందికి కరోనా నిర్ధారణ అయ్యిందని ఇన్చార్జి డీఎంహెచ్వో డాక్టర్ గాయత్రీదేవీ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 204 మందికి టెస్టులు చేయగా పటాన్చెరులో నలుగురికి, సంగారెడ్డిలో నలుగురికి పాజిటివ్గా తేలిందన్నారు
సంగారెడ్డిఅర్బన్, జూన్30: సంగారెడ్డి జిల్లాలో గురువారం ఎనిమిది మందికి కరోనా నిర్ధారణ అయ్యిందని ఇన్చార్జి డీఎంహెచ్వో డాక్టర్ గాయత్రీదేవీ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 204 మందికి టెస్టులు చేయగా పటాన్చెరులో నలుగురికి, సంగారెడ్డిలో నలుగురికి పాజిటివ్గా తేలిందన్నారు. ఎనిమిది మంది హోంఐసోలేషన్లో ఉన్నారని చెప్పారు. సంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఎనిమిది యాక్టివ్ పాజిటివ్ కేసులున్నాయని ఆమె పేర్కొన్నారు.