యువత ఉద్యోగ నైపుణ్యాలను అలవర్చుకోవాలి
ABN , First Publish Date - 2021-07-27T05:47:00+05:30 IST
విద్యార్థి దశ నుంచే యువత ఆయా రంగాలకు సంబంధించిన ఉద్యోగ నైపుణ్యాలను అలవర్చుకోవాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి మొక్కా జగన్నాథరావు అన్నారు.
దివాన్చెరువు, జూలై 26: విద్యార్థి దశ నుంచే యువత ఆయా రంగాలకు సంబంధించిన ఉద్యోగ నైపుణ్యాలను అలవర్చుకోవాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి మొక్కా జగన్నాథరావు అన్నారు. నన్నయ వర్సిటీ నైపుణ్యకేంద్రం ఆధ్వర్యంలో విటైగర్ సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సోమవారం ప్లేస్మెంట్డ్రైవ్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వీసీ మాట్లాడుతూ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటే ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. అనంతరం ఇంటర్యూలు నిర్వహించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం నైపుణ్య కేంద్రం కోఆర్డినేటర్ బి.జగన్మోహనరెడ్డి, ప్రిన్సిపాల్ వి.పెర్సిస్, విటైగర్ సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హెచ్.ఆర్.విద్యాదేవరాజ్ పాల్గొన్నారు.