కొవిడ్‌ సెంటర్ల కోసం టీటీడీ సత్రాల పరిశీలన

ABN , First Publish Date - 2021-04-23T08:11:37+05:30 IST

గోవిందరాజస్వామి సత్రాల్లో కొవిడ్‌ సెంటర్ల ఏర్పాటు కోసం కలెక్టర్‌ హరినారాయణన్‌ పరిశీలించారు.

కొవిడ్‌ సెంటర్ల కోసం టీటీడీ సత్రాల పరిశీలన
గోవిందరాజస్వామి సత్రాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ హరినారాయణన్‌, తదితరులు

తిరుపతి(రవాణా), ఏప్రిల్‌ 22: తిరుపతి నగరంతో పాటు జిల్లావ్యాప్తంగానూ కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతిలోని టీటీడీకి చెందిన గోవిందరాజస్వామి సత్రాల్లో కొవిడ్‌ సెంటర్ల ఏర్పాటు కోసం గురువారం కలెక్టర్‌ హరినారాయణన్‌ పరిశీలించారు. గతంలోనూ ఈ సత్రాల్లో కొవిడ్‌ సేవలు అందించారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సత్రాలను పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. అనంతరం శ్రీనివాసం, మాధవం అతిథి గృహాలను కూడా పరిశీలించారు. ఆయనవెంట జేసీలు వీరబ్రహ్మం, రాజశేఖర్‌లున్నారు. 

Updated Date - 2021-04-23T08:11:37+05:30 IST