క్రేన్ల సాయంతో బాహుదా కాలువలో పడ్డ లారీ వెలికితీత
ABN , First Publish Date - 2021-11-27T05:37:20+05:30 IST
మదనపల్లెనుంచి రెండు క్రేన్లను తెప్పించి బాహుదా వంతెన పక్కన ఒరిగి పోయిన లారీని పోలీసులు వెలికి తీశారు.
నిమ్మనపల్లె నవంబరు 26: మదనపల్లెనుంచి రెండు క్రేన్లను తెప్పించి బాహుదా వంతెన పక్కన ఒరిగి పోయిన లారీని పోలీసులు వెలికి తీశారు. కడప జిల్లా మైలవరం నుంచి గురువారం సిమెంటు బస్తాల లోడుతో వస్తున్న 2 లారీలు నిమ్మనపల్లె పశువైద్యశాల సమీపంలో ఉన్న అగ్రహారం వంతెన దాటుతుండగా ఉన్నట్టుండి వంతెన కుంగిపోవడంతో ఒక లారీ బోల్తా పడిన విషయం విదితమే. రూ.3లక్షల విలువైన సిమెంటు కొట్టుకు పోగా ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. వంతెన పూర్తిగా తెగిపోవడంతో ప్రస్తుతం చింతపర్తితో పాటు సుమారు పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.