ప్రజల సమస్యలపై పోరాడాలి : శ్రీనివాస్‌

ABN , First Publish Date - 2021-07-26T04:04:41+05:30 IST

ప్రజల సమస్యలపై పోరాడాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌ సూచించారు.

ప్రజల సమస్యలపై పోరాడాలి : శ్రీనివాస్‌

హవేళీఘణపూర్‌/వట్‌పల్లి, జూలై 25 : ప్రజల సమస్యలపై పోరాడాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌ సూచించారు. ఆదివారం మండల పరిధిలోని కూచన్‌పల్లి గ్రామంలో బీజేపీ మండల కార్యవర్గ సమావేశం నిర ్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులందరికీ డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు, నిరుద్యోగ భృతి, పింఛన్లు, రేషన్‌కార్డులు సకాలంలో అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు రంజిత్‌రెడ్డి, జిల్లా నాయకుడు శ్రీపాల్‌, సందీప్‌, రమాకాంత్‌, రాంచందర్‌రావు పాల్గొన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికతో సీఎం కేసీఆర్‌కు బీజేపీ భయం పట్టుకున్నదని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు రవీందర్‌ అన్నారు. ఆదివారం వట్‌పల్లి మండలంలో నిర్వహించిన బీజేపీ మండల కార్యకర్తల సమావేశానికి హాజరై మాట్లాడారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు మఠం చంద్రశేఖర్‌, మండల అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శులు నర్సింహులు, అనిల్‌కుమార్‌, మండల ఉపాధ్యక్షుడు శివమూర్తి స్వామి పాల్గొన్నారు.

Updated Date - 2021-07-26T04:04:41+05:30 IST