ఫొటో ఓటర్ల తుది జాబితా విడుదల
ABN , First Publish Date - 2021-01-16T07:02:24+05:30 IST
ఓటర్ల ఫొటోతో కూడిన తుది జాబితాను జిల్లా ఎన్నికల సం ఘం శుక్రవారం విడుదల చేసింది.
పురుషులు 16,16,175 - మహిళలు 16,53,146
చిత్తూరు కలెక్టరేట్, జనవరి 15: ఓటర్ల ఫొటోతో కూడిన తుది జాబితాను జిల్లా ఎన్నికల సం ఘం శుక్రవారం విడుదల చేసింది. మొత్తం ఓటర్లు.. 32,69,677 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 16,16,175 మంది, మహిళలు 16,53,146 మంది, ఇతరులు 356 మంది. పురుషుల కంటే మహిళా ఓటర్లు 36,971 మంది ఎక్కువగా ఉన్నారు. చంద్రగిరిలో అత్యధికంగా 2,98,128 మంది, తర్వాతి స్థానంలో తిరుపతిలో 2,80,351 మంది, చిత్తూరులో అత్యల్పంగా 2,00,020మంది ఓటర్లున్నారు. పురుష ఓటర్లు కుప్పం, జీడీ నెల్లూరు నియోజకవర్గాల్లో అధి కం కాగా.. మిగిలిన 12 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. జిల్లా ఎన్నికల సంఘం గత నవంబరు 16న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించింది. అప్పట్లో ఓటర్లు 32,43,516 మంది ఉండగా, ఇపుడు 26,161 మందిపెరిగారు. ఇతరుల ఓటర్లలో మార్పు లేదు.
నియోజకవర్గాల వారీగా ఓటర్లు
నియోజకవర్గం మొత్తం పురుషులు మహిళలు ఇతరులు
తంబళ్లపల్లె 214822 106984 107825 13
పీలేరు 229400 113731 115661 08
మదనపల్లె 254976 126021 128893 62
పుంగనూరు 235710 116613 119077 20
చంద్రగిరి 298128 145860 152214 54
తిరుపతి 280351 139385 140918 48
శ్రీకాళహస్తి 244824 118678 126120 26
సత్యవేడు 209884 102422 107445 17
నగరి 202637 99244 103386 07
జీడీ నెల్లూరు 202891 101516 101362 13
చిత్తూరు 200020 98301 101675 44
పూతలపట్టు 217757 107931 109808 18
పలమనేరు 259768 129259 130505 04
కుప్పం 218509 110230 108257 22