కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో తొలి బోనాల ఉత్సవాలు
ABN , First Publish Date - 2022-07-07T05:45:53+05:30 IST
కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో తొలి బోనాల ఉత్సవాలు
షాద్నగర్ అర్బన్, జూలై 6: షాద్నగర్ తాలుకా కుమ్మరి సంఘం ఆధ్వ ర్యంలో పోచమ్మ తొలి బోనాల ఉత్సవం బుధవారం ప్రారంభమైంది. సంఘం తాలుకా అధ్యక్షుడు నడికూడ శ్రీశైలం ఆధ్వర్యంలో 301 బోనాలతో ఊరేగింపును నిర్వహించారు. స్థానిక సాయిరాజు ఫంక్షన్ హాలు నుంచి పరిగి రోడ్డులోని పోచమ్మ ఆలయం వరకు ఊరేగింపు కొనసాగింది. అంబర్పేట నుంచి వచ్చిన ఐదుగురు పోతురాజు వేషధారణలతో విన్యాసాలు చేస్తూ అలరించారు. ఉత్సవాల్లో కేశంపేట ఎంపీపీ వై. రవీందర్యాదవ్, షాద్నగర్ మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీర్లపల్లి శంకర్, బీజేపీ నాయకుడు ఎన్. శ్రీవర్ధన్రెడ్డి, కుమ్మరి సంఘం నాయకులు రాయికల్ శ్రీనివాస్, అంజయ్య, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.