డ్రంకెన్‌ డ్రైవ్‌లో ఐదుగురికి రూ.50 వేలు జరిమానా

ABN , First Publish Date - 2021-07-27T04:12:31+05:30 IST

డ్రంకెన్‌ డ్రైవ్‌లో ఐదుగురికి రూ.50 వేల జరిమానా విధించినట్లు గజ్వేల్‌ ట్రాఫిక్‌ సీఐ మధుసూదన్‌రెడ్డి తెలిపారు.

డ్రంకెన్‌ డ్రైవ్‌లో ఐదుగురికి రూ.50 వేలు జరిమానా

గజ్వేల్‌, జూలై 26 : డ్రంకెన్‌ డ్రైవ్‌లో ఐదుగురికి రూ.50 వేల జరిమానా విధించినట్లు గజ్వేల్‌ ట్రాఫిక్‌ సీఐ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆరురోజుల క్రితం ట్రాఫిక్‌ ఎస్‌ఐ ఆనంద్‌గౌడ్‌, సిబ్బందితో కలిసి గజ్వేల్‌ పట్టణంలోని ఆయా చౌరస్తాల్లో డ్రంకెన్‌ డ్రైవ్‌ నిర్వహించగా, ఐదుగురు మద్యం సేవించి ఉన్నట్లు గుర్తించి సోమవారం గజ్వేల్‌ కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన గజ్వేల్‌ ప్రిన్సిపల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ర్టేట్‌ రవీందర్‌ సత్తు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.50 వేల జరిమానా విధించినట్లు తె లిపారు. 

Updated Date - 2021-07-27T04:12:31+05:30 IST