నిధులు లేని పదవులెందుకు..?

ABN , First Publish Date - 2021-01-22T05:48:40+05:30 IST

నిధులు లేని పదవులెందుకు..?

నిధులు లేని పదవులెందుకు..?
ఆందోళన చేస్తున్న ప్రజాప్రతినిధులు

ఘట్‌కేసర్‌ రూరల్‌: నిధులులేని పదవులు తమకెందుకని ఘట్‌కేసర్‌ ఎంపీటీసీలు ఆందోళన వ్యక్తం చేశారు. ఘట్‌కేసర్‌లో  ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి అధ్యక్షతన గురువారం నిర్వహించిన మండల పరిషత్‌ సమావేశాన్ని ఎంపీటీసీలు రెండవసారి బహిష్కరించారు. మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము గెలిచినప్పటి నుంచి ఒక్కపైసా కూడా మంజూరు కాలేదని తమ వార్డుల్లో ఎలా తలెత్తుకొని తిరగాలని ఆరోపించారు. గ్రామాల్లోకి వెళ్లాలంటేనే అవమానంగా ఉందని వాపోయారు. యాదాద్రి జిల్లాలో ఎమ్మెల్యేలు మండలాలకు నిధులు ఇస్తుంటే ఇక్కడ మాత్రం మంత్రి మల్లారెడ్డి నిధులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. నిధులు లేని పక్షంలో మండల వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ ఎంపీపీ కర్రె జంగమ్మ, ఎంపీటీసీ సభ్యులు మలిపెద్ది వెంకట్రామిరెడ్డి, భాస్కర్‌రెడ్డి, కందుల సరళ, గట్టగల్ల రవి, వినోద, శోభారాణి, రామారావులు ధర్నాకు దిగారు. ఎంపీటీసీలకు సర్పంచ్‌ వెంకటే్‌షగౌడ్‌, సురేష్‌, యాదగిరి, కావేరి, జలజ, రమాదేవిలు సంఘీభావం తెలిపారు.

Updated Date - 2021-01-22T05:48:40+05:30 IST