టిడ్కో గృహాల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలి: Prabhakar

ABN , First Publish Date - 2022-02-01T17:26:44+05:30 IST

టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందించాలంటూ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర చౌదరి నిరాహార దీక్ష చేపట్టారు.

టిడ్కో గృహాల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలి: Prabhakar

అనంతపురం: టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందించాలంటూ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర చౌదరి నిరాహార దీక్ష చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట ప్రభాకర్ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా టిడ్కో గృహాలు 60 శాతం నుంచి 80 శాతం నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. అర్ధంతరంగా ఆగిపోయిన టిడ్కో గృహాల నిర్మాణాలను వెంటనే పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రయోజనాలకు పెట్టిన పథకాలను తీసివేయడం దారుణమన్నారు. ప్రభుత్వాలు మారుతుంటాయని.. కానీ 80 శాతం పూర్తి చేసిన పథకాలను వదిలివేయడం ఏమిటని ప్రశ్నించారు. టిడ్కో ఇళ్లకు ఎన్టీఆర్ పేరు పెట్టడం ఇష్టం లేకపోతే వేరే పేరు పెట్టి వాటిని పేదలకు అందించాలన్నారు. జిల్లాలో దాదాపు తొమ్మిది వేల ఇళ్లు 60 శాతం పూర్తయి ఉన్నాయని తెలిపారు. ఇక నుంచి వైసీపీ ప్రభుత్వ ఆగడాలను ప్రజల్లోకి తీసుకెళతామని ప్రభాకర్ చౌదరి స్పష్టం చేశారు. 

Updated Date - 2022-02-01T17:26:44+05:30 IST