పండ్ల దుకాణం దగ్ధం
ABN , First Publish Date - 2021-05-09T05:06:02+05:30 IST
పండ్ల దుకాణం దగ్ధం
ఘట్కేసర్: ఘట్కేసర్లో రోడ్డుపక్కన ఉన్న పండ్ల దుకాణంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. ఘట్కేసర్లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆంధ్రప్రదేశ్కు చెందిన రమేశ్ అనే వ్యక్తి గుడిసె వేసుకుని పండ్లు, కూరగాయల వ్యాపారం చేసుకుంటున్నాడు. అయితే ఆ గుడిసెకు వెనుకభాగంలో ట్రాన్స్ఫార్మర్ ఉంది. శనివారం ఉదయం ఉన్నట్టుండి ఒక్కసారిగా గుడిసెకు మంటలు అంటుకున్నాయి. స్థానికులు గమనించి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించడంతో వచ్చి మంటలను ఆర్పి వేశారు. ఎవరికీ ప్రమాదం జరగలేదు. కాగా షార్ట్ సర్క్యూట్తో మంటలు అంటుకుని ఉంటాయని ఫైర్ సిబ్బంది అనుమానిస్తున్నారు. ఘటన స్థలాన్ని మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్యయాదవ్, వైస్చైర్మన్ పల్గుల మాధవరెడ్డి, పలువురు కౌన్సిలర్లు పరిశీలించారు. రోడ్డపక్కన అనుమతి లేకుండా ఎలాంటి వ్యాపారాలు నిర్వహించవద్దని వారు సూచించారు.