కొత్తగూడ అభివృద్ధికి నిధులివ్వండి

ABN , First Publish Date - 2022-07-01T06:14:51+05:30 IST

కొత్తగూడ అభివృద్ధికి నిధులివ్వండి

కొత్తగూడ అభివృద్ధికి నిధులివ్వండి

కందుకూరు, జూన్‌ 30: కొత్తగూడ గ్రామాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని ఆ గ్రామ సర్పంచ్‌, బీజేపీ జిల్లా పంచాయతీ సెల్‌ కన్వీనర్‌ సాధ మల్లారెడ్డి గురువారం కేంద్ర గ్రామీణ ఆభివృద్ధి శాఖ మంత్రి సాద్వినిరంజన్‌జ్యోతికి వినతి పత్రం అందజేశారు. నగరంలో గురువారం జరిగిన బీజేపీ సమావేశానికి కేంద్ర మంత్రి హాజరు కాగా ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డితో కలిసి మల్లారెడ్డి మంత్రికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మంద జ్యోతి, ఎంపీటీసీలు బొక్క జ్యోతి, ఎల్మటి లక్ష్మి, మాజీ వైస్‌ ఎంపీపీ కృష్ణగౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-07-01T06:14:51+05:30 IST