రెవెన్యూ అధికారుల సహకారంతో..

ABN , First Publish Date - 2021-05-11T04:17:43+05:30 IST

వజ్రపుకొత్తూరు మండలం రాజాం గ్రామంలో కరోనా లక్షణాలతో ఓ వృద్ధుడు (56) సోమవారం మృతిచెందాడు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు గ్రామస్థులు ఎవరూ సహకరించలేదు.

రెవెన్యూ అధికారుల సహకారంతో..
వృద్ధుడి మృతదేహాన్ని శ్మశానికి తరలిస్తున్న రెవెన్యూ అధికారులు



- వజ్రపుకొత్తూరులో వృద్ధుడికి అంత్యక్రియలు

వజ్రపుకొత్తూరు : వజ్రపుకొత్తూరు మండలం రాజాం గ్రామంలో కరోనా లక్షణాలతో ఓ వృద్ధుడు (56) సోమవారం మృతిచెందాడు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు గ్రామస్థులు ఎవరూ సహకరించలేదు. విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ అప్పలస్వామి.. ఆర్‌ఐ కిరణ్‌కుమార్‌కు సమాచారం అందజేశారు. వెంటనే ఆర్‌ఐ ఆ గ్రామానికి చేరుకుని.. స్థానిక పెద్దలతో మాట్లాడారు. అయినా అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. చేసేదిలేక పలాస మునిసిపాలిటీ నుంచి నలుగురు వ్యక్తులను రప్పించారు. వీఆర్వో గీతాంజలి, జూనియర్‌ అసిస్టెంట్‌ నిఖిల్‌తో కలసి అంత్యక్రియలు నిర్వహించారు. ఇలా ఆపద వేళ.. ఇరుగుపొరుగు వాళ్ల సాయం కూడా లేకపోవడంతో కరోనా మృతుల కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో రెవెన్యూ అధికారులు, పారిశుధ్య సిబ్బంది ముందుకొచ్చి తమ సేవలు అందిస్తున్నారు. కరోనా బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. 



Updated Date - 2021-05-11T04:17:43+05:30 IST