నిరాడంబరంగా వేంకటేశుని కల్యాణం

ABN , First Publish Date - 2021-04-23T05:53:53+05:30 IST

అమలాపురం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణం కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ గురువారం నిరా డంబరంగా నిర్వహించారు.

నిరాడంబరంగా వేంకటేశుని కల్యాణం

అమలాపురంటౌన్‌, ఏప్రిల్‌ 22: అమలాపురం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణం కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ గురువారం నిరా డంబరంగా నిర్వహించారు. ఆలయ ఈవో బొక్కా వీరవెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణం జరిపించారు. కల్యాణబ్రహ్మ సుదర్శనం మురళీకృష్ణాచార్యుల ఆచార్య బ్రహ్మత్వంలో కల్యాణదాత తోరం రాము, అంతర్వేదిదేవి దంపతులు స్వామివారి కల్యాణం జరిపించారు. స్వామి, అమ్మవార్లకు ఆలయ ఈవో వెంకటేశ్వరరావు పట్టువస్ర్తాలు సమర్పించారు. కర్రి పద్మనాభనాయుడు, దేవకీదేవి, నిమ్మకాయల సత్యనారాయణ దంపతు లతో పాటు ఉపద్రష్ట నాగాదిత్యన్‌, ఉపద్రష్ట నాగార్జున్‌ పలువురు భక్తులు స్వామివారికి ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. స్వామివారి కల్యాణంలో ఆలయ ట్రస్టీలు మామిడిపల్లి వెంకటరత్నం, భరణికాన జయలక్ష్మిగోవింద మ్మ, ముంగర దేవిక, నడింపల్లి పద్మావతి, చంద్రమోహన్‌ పాల్గొన్నారు. 

ఆత్రేయపురం, ఏప్రిల్‌ 22:  వాడపల్లి వేంకటేశ్వరస్వామి వార్షిక కల్యాణోత్సవాలకు గురువారం సాయంత్రం అంకురార్పణ జరిపారు. వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం వేద పండితులు గరుడపటం ఎగురవేశారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం రాత్రి కల్యాణాన్ని అంతరాలయంలో ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఏర్పాట్లను ఈవో ముదునూరి సత్యనారాయణరాజు పర్యవేక్షించారు. ఆలయం చుట్టూ, పరిసర రహదారుల్లో సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. 

Updated Date - 2021-04-23T05:53:53+05:30 IST