పాత తాండూరుకు ఫ్లైఓవర్‌ బ్రిడ్జి మంజూరు

ABN , First Publish Date - 2022-07-01T06:33:38+05:30 IST

పాత తాండూరుకు ఫ్లైఓవర్‌ బ్రిడ్జి మంజూరు

పాత తాండూరుకు ఫ్లైఓవర్‌ బ్రిడ్జి మంజూరు
జీవో కాపీని అందుకుంటున్న ఎమ్మెల్యే


తాండూరు, జూన్‌ 30: పాత తాండూరు ప్రజల కల నెరవేరింది. పాత తాండూరు ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం రూ.74 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇట్టి జీవోను ప్రభుత్వ కార్యదర్శి శ్రీనివాసరాజు గురువారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి అందజేశారు. దశాబ్దాల కాలంగా వంతెన నిర్మాణం కొరకు ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. గతంలో కూడా బ్రిడ్జి నిర్మాణానికి  శంకుస్థాపన జరిగినా.. నిధులు మంజూరు కాలేదు. తాజాగా బ్రిడ్జి నిర్మాణం కొరకు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపారు. ఇటీవల సీఎం కేసీఆర్‌ను కలిసి నిధులు మంజూరు చేయించేలా ఒప్పించారు. నాంపల్లి, సికింద్రాబాద్‌ నుంచి వికారబాద్‌-తాండూరు మీదుగా ముంబాయి, బెంగళూరు, ఔరంగాబాద్‌, మన్మాడ్‌, షిర్డీ, బీదర్‌, జహీరాబాద్‌ వైపు రైళ్ల రాకపోకలు జరిగేవి. దీంతో ప్రతి 10 నిమిషాలకు ఒకసారి గేటు పడుతుండడంతో పాతతాండూరు వాసుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతుండేవారు. కాగా, త్వరలో బ్రిడ్జి నిర్మాణ పనులను మంత్రి కేటీఆర్‌ చేతులమీదుగా  ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2022-07-01T06:33:38+05:30 IST