జీఎస్ఎల్ మెడికల్ కళాశాలలో వైరాలజీ ల్యాబ్ ప్రారంభం
ABN , First Publish Date - 2020-10-27T07:14:25+05:30 IST
రాజానగరం సమీపంలోని జీఎస్ఎల్ మెడికల్ కళాశాలలో రూ.2 కోట్లతో నెలకొల్పిన వైరాలజీ ల్యాబ్ను కలెక్టర్ మురళీధర్రెడ్డి ఆదివారం ప్రారంభించారు.
రాజానగరం, అక్టోబరు 26: రాజానగరం సమీపంలోని జీఎస్ఎల్ మెడికల్ కళాశాలలో రూ.2 కోట్లతో నెలకొల్పిన వైరాలజీ ల్యాబ్ను కలెక్టర్ మురళీధర్రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపపత్రి ఎండీ డాక్టర్ గన్ని భాస్కరరావు మాట్లాడుతూ వైరస్ కారణంగా సంక్రమించే కొవిడ్-19, హెచ్ఐవీ, డెంగ్యూ తదితర వ్యాధుల నిర్ధారణ, వైరస్ మూలకాల రూపాంతరాలను విశ్లేషించడానికి వైరాలజీ లేబొరేటరీ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఈ ల్యాబ్ ద్వారా సత్వర ఫలితాలు వెల్లడించడానికి ఆర్టీ పీసీఆర్ టెక్నాలజీని ప్రవేశపెట్టినట్టు జీఎస్ఎల్ సంస్థల డీన్ డాక్టర్ వైవీ శర్మ కలెక్టర్కు వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వీఎస్ గురునాథ్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ టీవీఎస్పీ మూర్తి, మెక్రోబయాలజీ విభాగం అధిపతి డాక్టర్ ఏహెచ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.