గొడవ పడొద్దని చెప్పిన అన్న.. కానీ చివరకు తమ్ముడి మాటలకు సహనం కోల్పోయి..

ABN , First Publish Date - 2021-01-24T06:19:46+05:30 IST

భార్యాభర్తలు గొడవ పడొద్దని, వారించి..

గొడవ పడొద్దని చెప్పిన అన్న.. కానీ చివరకు తమ్ముడి మాటలకు సహనం కోల్పోయి..

గొడవ పడొద్దని చెప్పి చంపేశాడు!

భార్యాభర్తల తగవు వద్దని వారించిన అన్న

తమ్ముడి మాటలతో తీవ్ర అసహనం

కోపోద్రిక్తుడై ఇనుపరాడ్‌తో దాడి

తీవ్రగాయాలతో మృతి చెందిన తమ్ముడు 

చేగుంట మండలం నడిమితండాలో దారుణం


చేగుంట(మెదక్): భార్యాభర్తలు గొడవ పడొద్దని, వారించి నచ్చజెప్పబోయాడు ఓ అన్న. కానీ చివరకు తమ్ముడి మాటలకు సహనం కోల్పోయిన అన్న ఇనుపరాడ్డుతో తమ్ముడిపై దాడి చేశాడు. అన్న కొట్టిన దెబ్బలకు తాళలేని తమ్ముడు మృతి చెందాడు. మెదక్‌ జిల్లా చేగుంట మండలం నడిమితండాలో బర్మావత్‌ సురేష్‌(27), అతడి భార్య మంజుల శనివారం ఉదయం నుంచి గొడవపడుతున్నారు. అయితే వారిని వారించి గొడవను దూరం చేయాలని భావించిన సురేష్‌ అన్న బర్మావత్‌ పీరియా.. తమ్ముడి మాటలకు కోపోద్రిక్తుడయ్యాడు. సహనం కోల్పోయాడు. అక్కడే ఉన్న ఇనుప రాడ్డు తీసుకుని తమ్ముడు సురేష్‌ను ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. తీవ్రంగా గాయపడిన సురే్‌షను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందాడు. సురేష్‌కు ముగ్గురు పిల్లలున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చేగుంట ఎస్‌ఐ సుభా్‌షగౌడ్‌ తెలిపారు. 



Updated Date - 2021-01-24T06:19:46+05:30 IST