ఖైదీల సమస్యలపై ఆరా
ABN , First Publish Date - 2021-11-29T06:11:05+05:30 IST
ఖైదీల సమస్యలపై లీగల్ ఎయిడ్ కౌన్సిల్ సభ్యులు ఆరా తీశారు.
శ్రీకాళహస్తి, నవంబరు 28: పట్టణ ఉప కారాగారాన్ని ఆదివారం లీగల్ ఎయిడ్ కౌన్సిల్ సభ్యులు, పారా లీగల్ వలంటీర్లు సందర్శించారు. న్యాయ సేవా వారోత్సవాలలో భాగంగా ఖైదీల సమస్యలు, సబ్జైలులో వసతులపై ఆరా తీశారు. పరిసర ప్రాంతాలు, స్నానపు గదులు, భోజనశాల, భోజన నాణ్యతను పరిశీలించారు. లీగల్ ఎయిడ్ కౌన్సిల్ మెంబర్ రాజేశ్వరరావు మాట్లాడుతూ ఖైదీలకు మినరల్ వాటర్ వసతి కల్పించాల్సి ఉందని పురపాలకసంఘ అధికారులకు సూచించారు. అనంతరం పలువురు ఖైదీలు సమస్యలను విన్నవించగా, పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు రమేష్బాబు తదితరులు పాల్గొన్నారు.