ఇంటర్, పది పరీక్షలు రద్దు చేయాలి : పీడీఎ్సయూ
ABN , First Publish Date - 2021-04-23T06:21:54+05:30 IST
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇంటర్, పది పరీక్ష లు రద్దు చేయాలని పీడీఎ్సయూ నాయకులు డిమాండ్ చేశారు.
గుంతకల్లు టౌన, ఏప్రిల్ 22: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇంటర్, పది పరీక్ష లు రద్దు చేయాలని పీడీఎ్సయూ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక వైఎ్సఆర్ విగ్రహం వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా నియోజకవర్గ అధ్యక్షు డు కవిరెడ్డి ఈశ్వరయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్, పది పరీక్షలు రద్దు చేయకుం డా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతోందన్నారు. కార్యక్రమంలో నాయకులు డీ రం గస్వామి, రవికుమార్, ప్రసాద్, భరత, భీమేష్, సురేష్, వంశి, మధు, తరుణ్ పాల్గొన్నారు.