లోకేశ్పై క్రిమినల్ కేసా?
ABN , First Publish Date - 2021-05-09T05:51:04+05:30 IST
‘టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్పై అనంతపురం జిల్లాలో వైసీపీ నేతలు ఫిర్యాదు చేసి, క్రిమినల్ కేసు నమోదయ్యేలా చేశారు. ఇలాంటి చేతకాని పనులు చేసేందుకు అధికార పార్టీకి సిగ్గుండాలి’ అని చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని ధ్వజమెత్తారు.
అధికార పార్టీకి సిగ్గుండాలి: టీడీపీ
చిత్తూరు, మే 8 (ఆంధ్రజ్యోతి): ‘టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్పై అనంతపురం జిల్లాలో వైసీపీ నేతలు ఫిర్యాదు చేసి, క్రిమినల్ కేసు నమోదయ్యేలా చేశారు. ఇలాంటి చేతకాని పనులు చేసేందుకు అధికార పార్టీకి సిగ్గుండాలి’ అని చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని ధ్వజమెత్తారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. వైసీపీ నేత కాపు రామచంద్రారెడ్డిపై సోషల్ మీడియాలో లోకేశ్ అనుచిత పోస్టు పెట్టారని ఆ పార్టీ ఎస్టీ సెల్ నేత భోజరాజు నాయక్ ఫిర్యాదు చేయడం దారుణమని అభిప్రాయపడ్డారు. ఇలా.. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలపై పోలీసు కేసులు పెట్టి మానసికంగా హింసిస్తున్నారన్నారు.