నాడు-నేడు పనులు పూర్తి చేయండి

ABN , First Publish Date - 2021-07-24T05:35:58+05:30 IST

భానుగుడి (కాకినాడ), జూలై 23: జిల్లాలో నాబార్డ్‌ నిధుల ద్వారా పాఠశాలల్లో జరుగుతున్న నాడు-నేడు పథక పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జేసీ కీర్తి చేకూరి ఆదేశించారు. కలెక్టరేట్‌ గౌతమి విధాన సమావేశ మందిరంలో శుక్రవారం ప్రధానోపాధ్యాయులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మట్లాడుతూ ఇంజనీర్లు వెంటనే కాంట్రాక్టర్లకు ప్లాన్‌ ఇచ్చేలా

నాడు-నేడు పనులు పూర్తి చేయండి
సమావేశంలో మాట్లాడుతున్న జేసీ కీర్తి

భానుగుడి (కాకినాడ), జూలై 23: జిల్లాలో నాబార్డ్‌ నిధుల ద్వారా పాఠశాలల్లో జరుగుతున్న నాడు-నేడు పథక పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జేసీ కీర్తి చేకూరి ఆదేశించారు. కలెక్టరేట్‌ గౌతమి విధాన సమావేశ మందిరంలో శుక్రవారం ప్రధానోపాధ్యాయులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మట్లాడుతూ ఇంజనీర్లు వెంటనే కాంట్రాక్టర్లకు ప్లాన్‌ ఇచ్చేలా చూడాలని, అన్ని పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో సమగ్రశిక్షా ఏపీసీ బి.విజయభాస్కర్‌ , లక్ష్మణరెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-24T05:35:58+05:30 IST