ఆనలైన సేవలు వినియోగించుకోండి
ABN , First Publish Date - 2020-12-04T04:10:41+05:30 IST
బ్యాంకింగ్ ఆనలైన సేవలను సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ కె.శ్రీనివాసులు అన్నారు. గురువారం యూనియన బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం వద్ద ఆర్థిక అక్షరాస్యత చైతన్య రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. జేసీ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో బ్యాంకింగ్ ఆర్ధిక లావాదేవీలు
కలెక్టరేట్, డిసెంబరు 3:బ్యాంకింగ్ ఆనలైన సేవలను సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ కె.శ్రీనివాసులు అన్నారు. గురువారం యూనియన బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం వద్ద ఆర్థిక అక్షరాస్యత చైతన్య రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. జేసీ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో బ్యాంకింగ్ ఆర్ధిక లావాదేవీలు చేసుకునే వారు సురక్షిత బ్యాంకింగ్ పద్ధతిని అవలంభించాలన్నారు. దుకాణాల వద్ద ఉండే మైక్రో ఏటీఎం సేవలను పొందాలన్నారు. ఏటీఎం మిషన్లు వినియోగించే ముందు, తరువాత శానిటైజ్ తప్పనిసరి అన్నారు. దగ్గు, జలుబు, ఇతర రుగ్మతలతో బాధపడేవారు బ్యాంకులకు వెళ్లొద్దన్నారు. కార్యక్రమంలో యూనియర్ బ్యాంక్ ప్రాంతీయ మేనేజర్, డీజీఎం పి.కృష్ణయ్య, ఏజీఎం జి. జయజీవన్, లీడ్బ్యాంక్ మేనేజర్ జీవీబీడీ హరిప్రసాద్ పాల్గొన్నారు.
1111111111111111111111111111111111111111111111111111111111