జేపీ నడ్డా బహిరంగ సభను విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-05-16T06:53:25+05:30 IST

రాజమహేంద్రవరంలో జూన్‌ 5న జరిగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బహిరంగ సభను విజయవంతం చేయాలని కోనసీమ జిల్లా అధ్యక్షుడు మానేపల్లి అయ్యాజీవేమా చెప్పారు.

జేపీ నడ్డా బహిరంగ సభను విజయవంతం చేయాలి

అమలాపురం టౌన్‌, మే 15: రాజమహేంద్రవరంలో జూన్‌ 5న జరిగే  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బహిరంగ సభను విజయవంతం చేయాలని కోనసీమ జిల్లా అధ్యక్షుడు మానేపల్లి అయ్యాజీవేమా చెప్పారు. నడ్డా పర్యటనను విజయవంతం చేసేం దుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శ్రీమన్నారాయణ, పార్లమెం టు ఇన్‌చార్జి కె.హరీష్‌బాబు ఈనెల19 నుంచి మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటించి నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారని వివరించారు. అమలాపురంలో వేమా అధ్యక్షతన ఆదివారం సమావేశం జరిగింది.  జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకటసుబ్బారావు, నాయకులు యిళ్ల సత్యనారాయణ, అరిగెల వెంకటరామారావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-16T06:53:25+05:30 IST