పది రోజుల క్రితమే బండి తీసిస్తే

ABN , First Publish Date - 2021-03-02T05:46:43+05:30 IST

‘పదిరోజుల క్రితమే బండి కొనిచ్చాం.. అంతలోనే ఇలా ప్రాణాలు తీస్తుందనుకోలేదు’ అంటూ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కుమారుడి ఎదుట కన్నవారు బోరున విలపించారు.

పది రోజుల క్రితమే బండి తీసిస్తే
ప్రమాదంలో మృతిచెందిన ఐటీఐ విద్యార్థి గిరిచంద్‌

అంతలోనే తిరిగిరాని లోకాలకు ఐటీఐ విదార్థి  

రొంపిచెర్ల, మార్చి 1: ‘పదిరోజుల క్రితమే బండి కొనిచ్చాం.. అంతలోనే ఇలా ప్రాణాలు తీస్తుందనుకోలేదు’ అంటూ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కుమారుడి ఎదుట కన్నవారు బోరున విలపించారు. పోలీసుల కథనం మేరకు.. రొంపిచెర్ల మండలం బొమ్మయ్యగారిపల్లె పంచాయతీ పెద్దకురవపల్లెకు చెందిన కె.సహదేవ కుమారుడు గిరిచంద్‌(18) పీలేరు ఐటీఐ కళాశాలలో చదువుతున్నాడు. ఈనేపథ్యంలో సోమవారం పీలేరు నుంచి స్వగ్రామానికి ద్విచక్రవాహనంలో వెళుతుండగా తిరుపతి నుంచి మదనపల్లెకు వెళ్లుతున్న నాన్‌స్టాప్‌ బస్సు పెద్దగొట్టిగల్లు శివాలయం సమీపంలో ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్‌ చేయబోయి ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. గిరిచంద్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

Updated Date - 2021-03-02T05:46:43+05:30 IST