లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే చర్యలు

ABN , First Publish Date - 2022-01-23T05:14:26+05:30 IST

భానుగుడి (కాకినాడ), జనవరి 22: జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని స్కానింగ్‌ సెంటర్లలో గర్భస్త లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆర్డీవో చిన్నికృష్ణ హెచ్చరించారు. తన కార్యాలయంలో శనివారం ఆయన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి డివిజన్‌ స్థాయి పీసీ, పీఎన్‌డీటీ చట్టం అమలుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్ర

లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే చర్యలు
సమావేశంలో మాట్లాడుతున్న ఆర్డీవో చిన్నికృష్ణ

కాకినాడ ఆర్డీవో చిన్నికృష్ణ 

భానుగుడి (కాకినాడ), జనవరి 22: జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని స్కానింగ్‌ సెంటర్లలో గర్భస్త లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆర్డీవో చిన్నికృష్ణ హెచ్చరించారు. తన కార్యాలయంలో శనివారం ఆయన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి డివిజన్‌ స్థాయి పీసీ, పీఎన్‌డీటీ చట్టం అమలుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే ఆయా సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాకినాడ డివిజన్‌స్థాయిలో గుర్తింపు పొందిన 92 స్కానింగ్‌ సెంటర్లపై డెకాయ్‌ ఆపరేషన్లు, ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ప్రతి స్కానింగ్‌ సెంటర్ల వద్ద పీసీ, పీఎస్టీటీ చట్టానికి సంబంధించిన బోర్డులను, వాల్‌ పోస్టర్లను, ధరల పట్టికను తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు. కార్యక్రమంలో డీఐవో డాక్టర్‌ సీహెచ్‌వీ భరతలక్ష్మి, డాక్టర్‌ బీబీ మోమినా, ఎన్‌జీవో ప్రతినిధి కె.సింహాద్రి పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-23T05:14:26+05:30 IST