గొల్లపల్లి క్రాస్లో కర్ణాటక మద్యం స్వాధీనం
ABN , First Publish Date - 2021-04-18T06:34:38+05:30 IST
మడకశిర సెబ్ ఇనస్పెక్టర్ ఆదేశాల మేరకు ఎకై్ౖసజ్ స్టేషన పరిధిలోని గొల్లపల్లి క్రాస్ వద్ద కర్ణాటక ప్రాంతానికి చెందిన శ్రీకాంత అనే వ్యక్తి వద్ద నుంచి 60 కర్ణాటక మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు సెబ్ ఇనస్పెక్టర్ రాజేంద్రప్రసాద్ తెలిపారు.
మడకశిర అర్బన్,ఏప్రిల్ 17: మడకశిర సెబ్ ఇనస్పెక్టర్ ఆదేశాల మేరకు ఎకై్ౖసజ్ స్టేషన పరిధిలోని గొల్లపల్లి క్రాస్ వద్ద కర్ణాటక ప్రాంతానికి చెందిన శ్రీకాంత అనే వ్యక్తి వద్ద నుంచి 60 కర్ణాటక మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు సెబ్ ఇనస్పెక్టర్ రాజేంద్రప్రసాద్ తెలిపారు. కర్ణాటక మద్యం తీసుకువెళ్తున్నట్లు సమాచారం అందడంతో సిబ్బందితో వెళ్లి దాడులు నిర్వహించి మద్యం, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకుని కేసు నమోదుచేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో సెబ్ సబ్ఇన స్పెక్టర్ డార్కస్, హెడ్కానిస్టేబుళ్లు చంద్రశేఖర్, రమణరావు, కానిస్టేబుళ్లు ఉస్మాన, లక్ష్మీనారాయణ, నాగరాజు, విజయమ్మలు పాల్గొన్నారు.
అగళి: మండలంలోని నందరాజనపల్లి చెక్క్పోస్టు సమీపంలో కర్ణాటక ప్రాంతం డీవీహళ్లి గ్రామానికి చెందిన రంగరాజు వద్ద నుంచి 106 కర్ణాటక మద్యంప్యాకెట్లు, బ్యాగ్పైపర్ 8 పాకెట్లను శనివారం విక్రయిస్తుండగా ఎస్ఐ క్రిష్ణమణి, సిబ్బంది దాడిచేసి పట్టుకున్నారు. మొత్తం 114 కర్ణాటక మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదుచేసినట్లు ఎస్ఐ తెలిపారు.