కిటకిటలాడిన ఖాద్రీశుడి ఆలయం
ABN , First Publish Date - 2022-05-22T06:16:54+05:30 IST
శ్రీమత ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. పరీక్షలు పూర్తవడం, వారాంతపు సెలవు రోజుకావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చారు.
కదిరి, మే 21: శ్రీమత ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. పరీక్షలు పూర్తవడం, వారాంతపు సెలవు రోజుకావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణంతో పాటు తిరువీధులు రద్దీగా దర్శనమిచ్చాయి. భక్తుల సౌకర్యార్థం ఆలయంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు.