కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి
ABN , First Publish Date - 2020-09-22T06:41:24+05:30 IST
తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని సోమవారం మేడ్చల్లో నిర్వహించారు. మేడ్చల్ మున్సిపల్ కార్యాలయంలో
మేడ్చల్: తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని సోమవారం మేడ్చల్లో నిర్వహించారు. మేడ్చల్ మున్సిపల్ కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ ఆయన గొప్పతనాన్ని కొనియాడారు. కార్యక్రమంలో చైర్పర్సన్ మర్రి దీపిక నర్సింహారెడ్డి, వైస్చైర్మన్ చీర్ల రమేష్, కౌన్సిలర్లు జే.దేవరాజు, తుడుం గణేష్, మర్రి శ్రీనివాస్రెడ్డి, ఎడ్ల శ్రీనివాస్రెడ్డి, కౌడే మహేష్, కోఆప్షన్ సభ్యుడు నవీన్రెడ్డి, కమిషనర్ సత్యనారాయణరెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ సాయిరాంరెడ్డి నాయకులు నాగరాజు పాల్గొన్నారు.