గుర్తు తెలియని మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2021-03-01T06:12:52+05:30 IST

కొత్త వెలంపేటలో గుర్తుతెలియని వివాహిత మృతదేహం కనిపించింది. గ్రామ శివారు మామిడి తోటల్లో రైతు కూలీలు ఆదివారం పని చేస్తుండగా మహిళ మృతదేహం కంటపడింది.

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

 తుని రూరల్‌, ఫిబ్రవరి 28: కొత్త వెలంపేటలో గుర్తుతెలియని వివాహిత మృతదేహం కనిపించింది. గ్రామ శివారు మామిడి తోటల్లో రైతు కూలీలు ఆదివారం పని చేస్తుండగా మహిళ మృతదేహం కంటపడింది. దీంతో రూరల్‌ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఎస్‌ఐ గణేష్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం... 20 నుంచి 30 సంవత్సరాల వయసు ఉంటుంది. చంపి ప్లాస్టిక్‌ కవర్లలో మూటగట్టి మామిడితోటల్లో తగలబెట్టినట్టు ప్రాఽథమిక నిర్ధారణకు వచ్చామని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్టు ఆయన తెలిపారు.

Updated Date - 2021-03-01T06:12:52+05:30 IST